సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): లయన్స్ క్లబ్ ఆఫ్ పటాన్ చెరు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఫౌండర్, మాజీ జడ్పీటీసీ పటాన్ చెరు మాదిరి లయన్ జైపాల్ సౌజన్యంతో జిన్నారం మండలం నల్తూరు ప్రభుత్వ పాఠశాలలో డిస్టిక్ చైర్మన్ బుక్కినేని వెంకటేశ్వర్లు, లయన్ పద్మమోహన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు లయన్స్ క్లబ్ లయన్ అమరేందర్ రెడ్డి సమక్షంలో విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద బడుగు బలహీన విద్యార్థుల శ్రేయస్సు కొరకు మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు ట్రై, బెల్టు, బ్యాడ్జిలు ఇవ్వాలని ఉపాధ్యాయుల కోరగా.. డిస్టిక్ చైర్మన్ బుక్కినేని వెంకటేశ్వర్లు స్పందిస్తూ త్వరలో విద్యార్థులకు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కే. రాములు, టి.శేషు కుమార్, మహమ్మద్ అబ్దుల్లా, దయాకర్, మహమ్మద్ రఫీ, హేమలత తదితరులు పాల్గొన్నారు.