*నాగారంలో పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, దుస్తుల పంపిణీ*
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జూన్ 22
నాగారం మున్సిపాలిటీలోని 16వ వార్డు, నేతాజీ నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముప్పు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, సమాజ శ్రేయస్సులో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, వారి సేవలకు గుర్తింపుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరగాలని కౌకుట్ల చంద్ర రెడ్డి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బిజ్జా శ్రీనివాస్ గౌడ్, కాలనీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, కేశవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఇతర కాలనీ వాసులు, మున్సిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేతాజీ నగర్ కాలనీ అసోసియేషన్ ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడంపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేశారు.