Site icon PRASHNA AYUDHAM

దివ్యాంగులకు సహాయ ఉపకరణా సైకిల్ల పంపిణీ

IMG 20250609 WA0248

ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 9 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలీంకో వారి సౌజన్యంతో సామాజిక అధికారిత శివిర్ దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం తెలంగాణ స్కూల్ పాత కొత్తగూడెం నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ దివ్యాంగులు వారి తెలివితేటలతో, వారి సామర్థ్యాన్ని బట్టి పనులు చేసుకోని అన్ని రంగాలలో రాణించాలని, వారి దినచర్యలో భాగంగా ఈ సహాయ ఉపకరణాలు ఎంతో ఉపయోగపడతాయని, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించాలని అన్నారు. గత అక్టోబర్ నెలలో జిల్లాలోని గుండాల, భద్రాచలం, అశ్వరావుపేట, ఐ.డి.ఓ.సి. పాల్వంచ ప్రదేశాలలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరము నిర్వహించడం జరిగింది. ఎంపికైన 440 మంది దివ్యాంగులకు 1057 సహాయ ఉపకరణాలు(విలువ 1.11 కోట్లు) పంపిణీ చేయడం జరిగింది. లబ్ధిదారులకు బ్యాటరీ ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, వినికిడి యంత్రాలు, సిపి చైర్స్, చంక కర్రలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ సీఈవో బి.నాగ లక్ష్మి డిఎంహెచ్వో భాస్కర్ నాయక్, సిడిపిఓ పద్మశ్రీ, ఐ.ఈ.డి శ్రీరామ్, టి.వి.పి.ఎస్. అధ్యక్షుడు సతీష్, డి.సి.పి.ఓ.హరి కుమారి, సఖి అడ్మిన్ శుభ శ్రీ, హబ్ కోఆర్డినేటర్ రూప, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సందీప్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, కార్యాలయ సిబ్బంది వరప్రసాద్, నరేష్, ప్రవీణ్, అంగన్వాడి టీచర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version