వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా అడిషనల్ కలెక్టర్

నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
ఎడపల్లి నవంబర్ 08:

IMG 20241108 WA0236

ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో గల ( PACS ) సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రన్ని ఈరోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్ లో గల వరి ధాన్యాన్ని పరిశీలించారు. వరి ధాన్యం లో తేమశాతం పరిశీలించారు. సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ని సెంటర్లు ఉన్నాయని అందులో దొడ్డు రకం, సన్న రకం సెంటర్లు ఎన్ని ఉన్నాయనీ అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని సూచించారు. సెంటర్ ఏర్పాట్లు వడ్ల కొనుగోలు గురించి అక్కడ ఉన్న రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్, సెంటర్ ఇంచార్జ్ బండారి నరసయ్య , రైతులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now