Site icon PRASHNA AYUDHAM

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

IMG 20250618 175535

Oplus_0

సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లాలో ఇటీవల బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.భవాని చంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. సంగారెడ్డి న్యాయస్థాన సముదాయ భవనంలోని జిల్లా జడ్జి ఛాంబర్ లో ప్రధాన న్యాయమూర్తికి పూల మొక్కను అందించారు. ఈ సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) ఆధ్వర్యంలో అమలు చేసే న్యాయ సహాయ కార్యక్రమాలపై ఇరువురు కొద్ది సేపు చర్చించారు.

Exit mobile version