Site icon PRASHNA AYUDHAM

ఇంటింటి సమగ్ర సర్వే పకడ్బందీగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

GridArt 20241113 192529924

ఇంటింటి సమగ్ర సర్వే పకడ్బందీగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్ 13:

సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ను పకడ్బందీగా అన్ని అంశాలకు సంబంధించిన వివరాలను ప్రతీ ఇంటి యజమాని నుండి సేకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో చేపడుతున్న సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం జారీచేసిన ప్రశ్నావళి ప్రకారం ప్రతీ ఇంటిలోని వారి నుండి పూర్తి సమాచారాన్ని సేకరించి నమోదు చేయాలని తెలిపారు. కుటుంబం లోని ప్రతీ ఒక్కరి సమాచారాన్ని నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి రాజారాం, మండల పరిషత్ అధికారి సబిత, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version