రెండు ఏవీఎం గోదాంలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో రెండు ఈవీఎం గోదామును శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు.వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో ఈవీఎం గోదాం తాళాలను తీయించారు.గోదాంలో ఉన్న చెడిపోయిన ఈవీఎంలను పరిశీలించారు.ఈవిఎంలకు సంబంధించిన రిజిస్టర్లను చూశారు. ఈవీఎంలను ఈసీఎల్, బెంగళూరు, బెంక్, బిహెచ్ఎల్ కంపెనీలకు పంపుతామని ఎన్నికల విభాగం అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవోలు రఘునాథరావు, ప్రభాకర్, ఎన్నికల విభాగం అధికారులు ప్రేమ్ కుమార్, అనిల్ కుమార్, ప్రియదర్శిని, రాజకీయ పార్టీల ప్రతినిధులు నిరంజన్, కాసిం, తదితరులు పాల్గొన్నారు.
రెండు ఏవీఎం గోదాంలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
by admin admin
Published On: August 17, 2024 12:21 am