ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 11 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్.సి
_పాల్వంచ ప్రభుత్వ వైద్యశాల మెరుగైన వైద్య సేవలు మరియు నెలకి నూటికి పెరిగిన ప్రసవాల సంఖ్య_సంక్లిష్టమైన ఆపరేషన్లకు కేరాఫ్ అడ్రస్ గా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి అన్నారు.పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి లో గతంతో పోలిస్తే వైద్య సేవలు మరింత మెరుగయ్యాయని ఇందుకు జాతీయస్థాయి ఎన్ ఓ ఏ ఎస్ సర్టిఫికేషన్ రావడమే ఉదాహరణ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. ఆసుపత్రిలో సేవలు మెరుగు పడటానికి కృషిచేసిన డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంప్రసాద్ మరియు వైద్య సిబ్బందిని ఆయన అభినందించారు. గత నెలలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగి 100 వరకు చేరుకోవటం, ఖరీదైన సంక్లిష్టమైన మోకాళ్ళ కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించటం,రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న 60 ఏళ్ల మహిళకు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిర్వహించడం పట్ల జిల్లా కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు విశేష కృషి చేసిన ప్రసూతి వైద్యురాలు డాక్టర్ సరళ, డాక్టర్ సోమరాజు దొర మరియు డాక్టర్ శైలేష్ కుమార్ లను ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటికే రూ.78 లక్షలు ఎమ్మెల్యే డిఎంఎఫ్టీ ఫండ్ తో ఆసుపత్రికి కావలసిన సామాగ్రిని కొనుగోలు చేయుటకు టెండర్లు పిలవగా,ఆసుపత్రిలో మహిళా శక్తి క్యాంటీన్ ,ఓపెన్ జిమ్ త్వరలో ఏర్పాటు కానున్నాయి. ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించడంలో ఎటువంటి సహాయం కావాలన్నా తానున్నాను అని జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంప్రసాద్, ఆర్ఎంవో సోమరాజు దొర మరియు నర్సింగ్ సూపరింటెండెంట్ లక్ష్మి మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు భేష్ అభినందించిన జిల్లా కలెక్టర్
by Naddi Sai
Published On: December 11, 2024 8:05 pm
