జితేష్ వి. పాటిల్
ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 20 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
రామవరంలో ఎం సి హెచ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని ఆరోగ్య శాఖ సిబ్బందిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ ఆదేశించారు. గర్భిణులు మరియు నవజాత శిశువులలో జన్యు మరియు జీవక్రియ రుగ్మతలను ముందస్తుగా గుర్తించడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించు కోవాలని ప్రజలకు సూచించారు.గర్భధారణకు ముందు, కాబోయే తల్లిదండ్రులు తమ ఆరోగ్య సంరక్షణ నిపుణులతో జన్యుపరమైన రుగ్మతతో బిడ్డ పుట్టే ప్రమాదం గురించి మాట్లాడి తెలుసుకోవాలని కోరారు.తల్లిదండ్రులు జన్యుపరమైన అసాధారణతల (ప్రీనేటల్ జెనెటిక్ కౌన్సెలింగ్) ప్రమాదాల గురించి ఆరోగ్య సంరక్షణ నిపుణులతో మాట్లాడాలి అన్నారు. భావి తల్లిదండ్రులు వారి కుటుంబ చరిత్ర మరియు ఇతర వైద్య చరిత్రను వారి వైద్యుడు లేదా జన్యు సలహాదారుతో సమీక్షించి, వంశపారంపర్య జన్యుపరమైన అసాధారణతతో బిడ్డ పుట్టే ప్రమాదం సగటు కంటే ఎక్కువగా ఉందో లేదో నిర్ధారించవచ్చనన్నారు. ఆ ప్రమాదాలను మరింత ఖచ్చితంగా అంచనా వేయడానికి పరీక్షలు ( జెనెటిక్ క్యారియర్ స్క్రీనింగ్ ) చేయవచ్చు. జన్యు స్క్రీనింగ్ పరీక్షలు ద్వారా కాబోయే తల్లితండ్రులకు జన్యుపరమైన అసాధారణత ఉందని చూపిస్తే, దంపతులు మరియు వైద్యుడు ఆ అసాధారణతను పిల్లలకి సంక్రమించకుండా నివారించేందుకు చర్యలు చేపట్టవచ్చు అన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎం & హెచ్ ఓ డాక్టర్ భాస్కర్ నాయక్,డాక్టర్ విజయ లక్ష్మి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ & హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్, డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు,డా.రాధామోహన్ సూపరింటెండెంట్, జి జి హెచ్ డాక్టర్ బాలాజీ – ప్రోగ్రాం ఆఫీసర్ చైల్డ్ హెల్త్, ఇమ్యునైజేషన్ & టిబి, డాక్టర్ చైతన్య – ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎంహెచ్ఎన్ డాక్టర్ మధువరన్ పిఓ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్, డాక్టర్ స్పందన పిఓ కమ్యూనికేబుల్ డిసీజెస్ & ఎన్ యు హెచ్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ & ఎం సి హెచ్ రామవరం సిబ్బందికి చెందిన నిపుణుల బృందం ఇందులో పాల్గొన్నారు.
మాతృ మరియు నవజాత శిశువుల వారసత్వ సింగిల్ జీన్ డిజార్డర్స్ కార్యక్రమాలో జిల్లా కలెక్టర్
by Naddi Sai
Published On: December 20, 2024 9:59 pm
