Site icon PRASHNA AYUDHAM

ఆశ్రమ గురుకుల వసతి గృహాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలి. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

IMG 20250207 WA0309

ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 7 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
ఆశ్రమ గురుకుల పాఠశాలలు మరియు వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే సౌకర్యాలు మెరుగుపరచాలని అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. శుక్రవారం పాల్వంచ ఆశ్రమ గురుకుల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డైనింగ్ హాల్, తరగతి గదులు, పరిసరాలు, మరుగుదొడ్లు, వంటగది పరిశీలించారు. పరిశీలనలో భాగంగా కలెక్టర్ విద్యార్థులతో మమేకమై వారికి అందుతున్న ఆహారం మెనూ ప్రకారం అందిస్తున్నారా మరియు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ డార్మెటరీ డోర్లు మరియు కిటికీలు, త్రాగునీటి సమస్యలు, ఎలక్ట్రికల్ సమస్యలు పరిష్కరించడానికి తగిన ప్రణాళికల అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. డార్మెటరీ హాల్లో దోమలు రాకుండా జాలి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రహరీ గోడ పై కంచ ఏర్పాటు చేయాలని దానికి అవసరమైన నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, నాణ్యత లేని పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదని ఆదేశించారు. పాఠశాలలు మరియు వసతి గృహాల్లో పరిశుభ్రత పాటించాలని అన్నారు.నాణ్యమైన విద్య, మెనూ సక్రమంగా అందించాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం అందరి బాధ్యత అని, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అవరోదించగలుగుతారని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.ఈ పర్సనల్ లో కలెక్టర్ వెంట డిడి ట్రైబల్ వెల్ఫేర్ మణెమ్మ, పాఠశాల హెడ్మాస్టర్ బద్రు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version