ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 13 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
చర్ల మండలం చింతకుంట, మొగళ్లపల్లి ఇసుక రీచ్ లను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇసుక రీచ్ లలో స్టాక్ రిజిస్టర్ను మరియు స్టాక్ పాయింట్ ను పరిశీలించారు. ఇసుక రీచ్ లో లోడింగ్ చేస్తున్న ట్రాక్టర్ మరియు లారీల లోడింగ్ వివరాలను అక్కడ పని చేస్తున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఇసుక రీచ్ లో రోజువారీ ఎన్ని లారీలు లోడింగ్ అవుతున్నాయి అని గ్రూప్ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఇసుక రిచ్ లో ఉన్న ఇసుక నిల్వలను పరిశీలించారు. సొసైటీ సభ్యుల పని వేళలు మరియు వే బిల్లుల తనిఖీ సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనుమతుల్లేకుండా ఇక ఇసుక ఎవరైనా తీసుకువెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతుల్లేకుండా ఇసుక తీసుకువెళ్లకూడదన్నారు.
ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట చర్ల తాసిల్దార్ ఎం శ్రీనివాస్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఇసుక రీచ్ లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
by Naddi Sai
Published On: February 13, 2025 7:21 pm
