మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

*IMG 20241016 WA3055

 బుధవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ చేపడుతున్న ఐసిడిఎస్ ఆక్టివిటీస్, చైల్డ్ ప్రొటెక్షన్, అడాప్షన్ మరియు చైల్డ్ హెల్ప్ లైన్ పై అధికారులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లోప పోషణకు గురైన పిల్లలను సాధారణ స్థితికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని, ప్రతి అంగన్వాడీ కేంద్రం నందు త్రాగునీటి వసతి, విద్యుత్, మరుగుదొడ్లు మొదలైన కనీస వసతులు కల్పించాలని అన్నారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మునగ, కరివేపాకు, ఉసిరి, చింత మరియు వెలగ మొక్కలు తప్పనిసరిగా నాటాలని ఆదేశించారు. ఈ మొక్కలు నాటి వినియోగించడం ద్వారా విటమిన్ ఏ, సి, డి మరియు క్యాల్షియం పుష్కలంగా వస్తాయని దీని ద్వారా పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు. జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల వివరాలు, స్థలం వివరాలు అందజేయాలని సిపిడిఓ లను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలు మరియు ఐసిడిఎస్ కార్యాలయం ల నిర్మాణంకు త్వరలోనే స్థలం కేటాయిస్తామన్నారు. జిల్లాలో బాల కార్మికుల నిర్మూలన, బాలల భిక్షాటన మరియు బాల్య వివాహాల నిర్మూలన కోసం డి సి పి యు సమన్వయంగా పనిచేసి జిల్లాను బాలల స్నేహపూరిత జిల్లాగా మార్చాలని అన్నారు. జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాల్లో తమ పరిధిలో ఎంతమంది పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారి ఖచ్చితమైన వివరాలను నిర్దేశించిన పట్టిక ద్వారా నమోదు చేయాలని ఆదేశించారు. ఖచ్చితమైన వివరాలు నమోదు చేయడం ద్వారా వారి ఆరోగ్య స్థితికి అనుగుణంగా వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉందని కలెక్టర్ అన్నారు.

సమీక్ష సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లేనిన, ప్రాజెక్ట్ సీపీడీవోలు, సిడబ్ల్యుసి మెంబర్లు, డి సి పి యు యూనిట్ మరియు చైల్డ్ హెల్ప్ లైన్ 1098సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now