ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 14 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
ములకలపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మట్టి ఇటుకలతో నిర్మిస్తున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా ఇటుకలను కంప్రెసర్ మిషన్ తో తయారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టే మట్టి ఇటుకల తయారీ లో భాగంగా మోడల్ గా ములకలపల్లి లో ప్రహరీ గోడ నిర్మించడం జరుగుతుందన్నారు. తక్కువ పెట్టుబడి తో సహజంగా గ్రామాల్లో దొరికే మట్టి పంట చేల గట్లలో దొరికే రాళ్ల తో మన అవసరాలకు కావలసిన పరిమాణంలో ఈ ఇటుకలను తయారు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ ఇటుకల తయారీలో ఏడు శాతం మట్టి రెండు శాతం సున్నం ఒక శాతం సిమెంట్ కలిపి తయారుచేసి పెట్టిన తర్వాత నిర్మాణాలకు ఉపయోగించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. దీనితోపాటుగా ఆసక్తి గల వారు చిన్న తరహా ఇటుకల పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందటంతో పాటు ఇంకా కొంతమందికి ఉపాధి కూడా కల్పించవచ్చన్నారు.
మట్టి ఇటుకలతో ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
by Naddi Sai
Published On: December 14, 2024 10:09 pm
