గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

ప్రశ్న ఆయుధo న్యూస్ డిసెంబర్ 14 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. టిజిపీఎస్సీ నిబంధనల మేరకు ఆదివారం 15 మరియు సోమవారం 16 తేదీలలో జిల్లాలో టిజిపిఎస్సి గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 13465 మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షకు హాజరుకానున్నారని ఇందుకు కొత్తగూడెం పట్టణంలో మొత్తం 38 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అభ్యర్థులందరూ పరీక్ష సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ ఎటువంటి పొరపాట్లకు తాగు లేకుండా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Join WhatsApp

Join Now