ప్రశ్న ఆయుధం న్యూస మార్చి3
కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
సోమవారం ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఈవీఎం గోడౌన్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతినెల తనిఖీ చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా సోమవారం ఈవీఎం గోడౌన్ ను సందర్శించడం జరిగిందని తెలిపారు. ఈ పరిశీలనలో భాగంగా ఈవీఎం, వీవీ ప్యాట్లు ఉన్న గదిని, సీసీ కెమెరా గదిలో కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన గోడౌన్ పరిసర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేనిదే ఎవరిని లోపలికి అనుమతించరాదని అధికారులకు సెక్యూరిటీ గార్డ్ కు తెలిపారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లు సంతకం చేశారు.ఈ తనిఖీలో కలెక్టర్ వెంట ఎన్నికల సూపర్డెంట్ ధారా ప్రసాద్, తాసిల్దార్ పుల్లయ్య, ఎన్నికల మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. ప్రశ్న ఆయుధం న్యూస్
by Naddi Sai
Published On: March 3, 2025 6:26 pm
