Site icon PRASHNA AYUDHAM

ఆశ్రమ గురుకుల వసతి గృహంలో చేపడుతున్న పనుల పురోగతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

IMG 20250217 WA0405

ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 17 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
పాల్వంచ ఆశ్రమ గురుకుల వసతి గృహంలో చేపడుతున్న పనుల పురోగతిని సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వసతి గృహం మరియు పాఠశాలల్లో చేపడుతున్న విద్యుకరణ పనులు, మరుగుదొడ్ల మరమ్మత్తులు పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 11 మరుగుదొడ్ల మరమ్మత్తులు రేపటి లాగా పూర్తిచేసి, విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చి మిగతా మరుగుదొడ్ల మరమ్మత్తుల పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు బట్టలు ఆరబట్టేందుకు గాను ఏర్పాటుచేసిన పైప్ ఫిట్టింగ్ మరియు తాడు పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేసి, జిల్లాలోని మిగతా వసతి గృహాల్లో కూడా ఇదే విధంగా ఏర్పాటు చేయాలని అన్నారు. విద్యార్థులకు ఏర్పాటుచేసిన బెడ్లను కలెక్టర్ పరిశీలించి ఇప్పటివరకు ఎన్ని బెడ్లు అందుబాటులోకి వచ్చినవి,ఇంకా ఎన్ని రావలసి ఉన్నది అని ఆరా తీశారు. విద్యార్థుల అందరికీ సరిపడా బెడ్లను ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వసతి గృహంలో చేపడుతున్న పైప్ లైన్ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట డి డి ట్రైబల్ వెల్ఫేర్ మణెమ్మ, ప్రధానోపాధ్యాయుడు బద్రు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version