Site icon PRASHNA AYUDHAM

రైతు ముఖాల్లో సంతోషం నింపుతున్న రైతు భరోసా: జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి

IMG 20250623 WA1950

**రైతు ముఖాల్లో సంతోషం నింపుతున్న రైతు భరోసా: జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి**

మేడ్చల్ మల్కాజ్‌గిరి, ప్రశ్న ఆయుధం జూన్ 23

రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తూ వారి ముఖాల్లో సంతోషం నింపుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే అని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అన్నారు. రైతు భరోసా పథకం కింద సోమవారం నాటికి మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో మొత్తం **5,116 మంది రైతులకు రూ. 4.61 కోట్లు** నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, *“రైతుల సంతోషమే ప్రభుత్వ విజయానికి ప్రతీక. వానాకాలం సాగు ప్రారంభానికి ముందే ఈ నిధులు అందించడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రగతిశీల నిర్ణయానికి నిదర్శనం. రైతు భరోసా ద్వారా వ్యవసాయ పెట్టుబడి భారం తగ్గి, ఉత్పాదకత పెరుగుతోంది”* అని తెలిపారు.రైతులకు మేలు చేసే విధంగా పథకం అమలు జరుగుతుందని, త్వరలో మరో విడత నిధులు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని కలెక్టర్ వివరించారు.

రైతులు సకాలంలో సాగు కార్యక్రమాలు ప్రారంభించేందుకు రైతు భరోసా ఎంతో దోహదపడుతోందని, ఈ చర్యలు అన్నదాతల భవిష్యత్తును నిలబెట్టే విధంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ విధమైన పథకాలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version