కామారెడ్డి లింగంపేట మండలంలో జిల్లా కలెక్టర్ పర్యటన.
భారీ వరదలతో పొలాలలో వెసిన ఇసుక మేటలు పరిశీలించిన జిల్లా కలెక్టర్
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి సెప్టెంబర్ 18
భారీ వర్షాల వరద బాధిత రైతులకు లబ్ది కలిగేలా పొలాల్లో వేసిన ఇసుకమేటల త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆసీస్ సాంగ్ వన్ అధికారులకు ఆదేశించారు.
గురువారం రోజున జిల్లా కలెక్టర్ లింగంపేట మండలంలోని బురిగిద్ద గ్రామంలో సమయంలో వచ్చిన వరదలతో రైతుల పొలాల్లోకి వచ్చిన మేట వేసినటువంటి రైతు అయినా సభావాత్ లక్ష్మి పొలంలో ఈజీఎస్ ద్వారా ఇసుకమేటల తొలగింపు కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్. బాధితులకు అండగా రైతులు అధైర్య పడద్దని ఈజీఎస్ ద్వారా ఉపాధి కూలీలకు 1 లక్ష 21 వేల రూపాయలు చెల్లించి పొలాల్లో ఉన్న 1200 క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగిస్తామని అన్నారు. లింగంపేట మండలంలోని 41 గ్రామాలలో సుమారుగా 287 ఎకరాలలో ఇసుకమేట వేసిందని పూర్తిస్థాయిలో ఇసుకల తొలగించి మళ్లీ పంటలు వేసుకునేలా సిద్ధం చేయాలని, పొలాలలో తొలగించిన ఇసుకను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించాలని ఎంపీడీవో నరేష్ ను ఆదేశించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని డిఆర్డిఓ సురేందర్ కు సూచించారు. పంట నష్టం వివరాలను పూర్తిస్థాయిలో సేకరించాలని వ్యవసాయ అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా ఇరిగేషన్ సిఇ శ్రీనివాస్ తో భారీ వర్షాలతో మండలంలోని అన్ని చెరువులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్ డి ఓ పార్థ సింహారెడ్డి, వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి, రెవెన్యూ శాఖల మరియు గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు.