ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారుల ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ… జిల్లాలో మొత్తం 34 సంఘాలకు నిర్వహించవలసివున్నది. అందులో 11 మత్స్య పారిశ్రామిక సంఘాలకు బ్యాలెట్ బాక్సల ద్వారా ఎన్నికలు నిర్వహించబడతాయని, మిగిలిన 23 ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల హ్యాండ్ రైజింగ్ ద్వారా అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు కొరకు రెవెన్యూ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, మౌలిక వసతులు కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ఎన్నికల కోసం ఎన్నికల సిబ్బందిని సిద్ధం చేయాలని, వారికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని కోపరేటివ్ అధికారులు ఆదేశించారు. జిల్లాలో ఏవైనా సమస్యత్మక పోలింగ్ కేంద్రాలు ఉంటే గుర్తించి, పోలీస్ సిబ్బందిని నియమించాలని పోలీస్ శాఖను ఆదేశించారు. సహకార శాఖ, పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘల ఎన్నికలను పూర్తి చేయాలన్నారు. ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే వరకు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, అదనపు ఎస్పీ సంజీవ్ రావు, జిల్లా మత్యశాఖాధికారి ఆర్ఎల్ మధుసూదన్, డిపిఓ సాయి బాబా, డిసిఓ కిరణ్ కుమార్, ఆర్ డిఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment