ఆర్డీఓ, తహసీల్దార్లతో టెలికాన్ఫిరెన్సులో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సమీక్ష.

ప్రజావాణి ధరణి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఆన్ లైన్ ఎంట్రీ పూర్తి చేయాలి..

జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

ఆర్డీఓ, తహసీల్దార్లతో టెలికాన్ఫిరెన్సులో సమీక్ష

IMG 20240807 WA0057

ధరణి, ప్రజావాణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్ లో ఉన్న ధరకాస్తులను త్వరితగతిన ఆన్లైన్ ఎంట్రీ పూర్తి చేయాలని, ధరణి సమస్యలను వారంలోపు పరిష్కరించాలని రెవిన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. జిల్లాలో ఉన్న ఆర్డీవోలు, ఎమ్మార్వోలతో ధరణి, ప్రజావాణి అప్లికేషన్లను త్వరితగతిన పరిష్కరించాలని బుధవారం టెలికాన్ఫిరెన్సు నిర్వహించారు. ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిపంపాలి, ప్రాపర్ గా రెవెన్యూ అధికారుల నుండి రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ధరణిలో అడిగిన రిమార్కులు జాగ్రత్తగా చూసి పంపాలన్నారు. లే అవుట్ రిజిస్ట్రేషన్లకు నాలా అనుమతులు తప్పనిసరిగా వుండాలని అన్నారు. నాలా అనుమతులు ఇచ్చేముందు చేరువులు ఆక్రమణకు గురికాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో దరఖాస్తులను క్షేత్రస్థాయి విచారణ, రికార్డుల పరిశీలన, సంబంధిత దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో అప్ డేట్ చేస్తూ డిస్పోస్ చేయాలని అన్నారు. దరఖాస్తుల సత్వర పరిశీలన కోసం అవసరమైతే అదనపు బృందాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఆర్ఎస్ఆర్ లిమిట్, మిస్సింగ్ సర్వే నెంబర్లు, సక్సెషన్, పిఓబి, మ్యూటేషన్ మొదలగు వివిధ సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన పద్ధతుల పై అధికారులకు పలు సూచనలు చేశారు. కోర్టు కేసులు, పిఓబి కేసులు అన్నింటిని పరిష్కరించాలన్నారు. ధరణి సమస్యల పరిష్కారంలో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే సంప్రదించాలని, వీలైనంత తొందరగా పెండింగ్ లేకుండా చూసుకోవాలని, తప్పులు చేయకుండా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మ్యుటేషన్, సక్సేషన్, నాలా కన్వర్షన్, ఖాతా మెర్జింగ్, పాస్ పుస్తకాలలో డేటా కరెక్షన్, టీఎం-33 తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులను తహసీల్దార్లు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాలన్నారు. టీఎం-33 లో తిరస్కరించినవి ఉంటే వెంటనే కలెక్టరేట్ కు పంపించాలని అన్నారు. సక్సేషన్ రికార్డులు కలెక్టరేట్ కు పంపినప్పుడు లీగల్ ఎయిడ్ సెర్టిఫికెట్ జతచేసి పంపాలన్నారు. వారి కుటుంబసభ్యులు వివరాలు తహసీల్దారులే నిర్ధారించాలని తెలిపారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించిన ప్రగతి గురించి రోజువారీగా నిశిత పరిశీలన జరపాలని ఆర్డీఓలను ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలనీ ఆదేశించారు. ప్రజావాణి పెండింగ్ లో వివిధ శాఖలకు చెందినవి, రెవిన్యూ శాఖకి చెందినవి వేగవంతంగా పరిష్కరించాలని అన్నారు. ఈ టెలికాన్ఫిరెన్సు లో ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now