ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 17 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
సంబంధిత అధికారులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ ఆదేశించారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శాఖల వారీగా అధికారులను ఆదేశించారు.గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు.కొత్తగూడెం పట్టణంలో నివాసం ఉంటున్న ఆకుల నాగేశ్వరరావు అక్షర టౌన్ షిప్ కొత్తగూడెం బ్రాంచ్ నందు నాలుగు లక్షల రూపాయలు నెల వడ్డీకి డిపాజిట్ చేసి ఉన్నానని, అందులో మూడు లక్షల రూపాయలు గడువు తీరిన పైకము చెల్లించడం లేదని ఈ విషయమై మేనేజర్రూ,,3 లక్షల రూపాయలకు చెక్కు ఇచ్చి ఉన్నారని, అవి బ్యాంకులో వేయగా రిటన్ అయ్యాయని కావున నా డబ్బులు ఇప్పించగలరని అని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం కొత్తగూడెం ఎస్పీకి ఎండార్స్ చేయడం జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిట్టి రామవరం కు చెందిన బానోతు రాములు s/o తులిశ్యా ప్రభుత్వం కల్పించిన ఆరు గ్యారంటీల పథకం గ్రామ సభ జరిగిన రోజున నాకు ఆరోగ్యం బాగా లేక హాస్పటల్లో ఉన్నానని దానివల్ల ఆరు గ్యారంటీల పథకం కోల్పోయానని మళ్లీ నాకు అవకాశం కల్పించగలరని నాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని మరియు మాకు కరెంటు, గ్యాస్ సబ్సిడీ ఇప్పించగలరని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్య నిమిత్తం విద్యుత్ శాఖ అధికారులకు ఎండార్స్ చేశారు.
పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన ధర్మసొత్ గోపా s/o బద్రు నేను లంబాడి (ఎస్టి) కులమునకు చెందినవాడని నా భూమిని గిరిజనేతరులు ఆక్రమించుకొనుగా భద్రాచలం ఎస్ డి సి (జె డబ్ల్యూ) వారి కోర్టులో ఎల్ టి ఆర్ కేసు పెట్టగా 22/5/2019 న ఆర్డర్లు ఇస్తూ నా భూమిని అప్ప చెప్పమని పాల్వంచ తహసిల్దార్ కు ఆర్డరు ఇచ్చినారని కానీ తహసిల్దార్ పాల్వంచ వారు నా భూమిని నాకు అప్పగించుటలేదని సదరు ఆర్డర్ ప్రకారం నా భూమిని నాకు అప్పగించమని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం పాల్వంచ తాసిల్దార్ కు ఎండార్స్ చేశారు.దమ్మపేట మండలం బాలరాజు గూడెం గ్రామంలో నివాసం ఉంటున్న శ్రీరాముల బుచ్చి బ్రహ్మం దమ్మపేట మండలం పట్వారి గూడెం రెవెన్యూ గ్రామంలో సర్వేనెంబర్ 3/ఇ లో 0-03, సర్వేనెంబర్ 4/ఇ లో 0-12 కుంటలు, మరియు సర్వేనెంబర్ 4/అ లో 0-10 కుంటల పట్టాభూమి ఉన్నదని, వారసత్వంగా మా తల్లిగారు రాసి ఇచ్చిన భూమిని మా అన్న కుమారుడు శ్రీరాముల శ్రీనివాసరావు ఆక్రమించారని కావున విచారణ చేపట్టి సదరు భూమి ఇప్పించవలసిందిగా చేసిన దరఖాస్తులు పరిశీలించి తగు చర్యలను నిమిత్తం దమ్మపేట తాసిల్దార్ కు ఎండార్స్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ విద్యా చందన మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్
