గిరిజన గ్రామాల్లో వైద్యం పూర్తిస్థాయిలో అందించడంలో జిల్లా స్థాయి అధికారులు నిర్లక్ష్య ధోరణి తగదు??
పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 20( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తు మహేశ్వరరావు
గతంలో ఇద్దరు డాక్టర్లు ఉండవలసిన మాదలంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంవత్సరం నుండి ఒకే డాక్టర్!!
ఇలా అయితే గిరిజన ప్రజలకి పూర్తి స్థాయిలో వైద్యం ఎలా?? అందుతుంది
జిల్లాస్థాయి అధికారులు మాట్లాడితే వైద్యం పూర్తిస్థాయిలో అందిస్తున్నాం అంటున్నారు మరి ఇద్దరు డాక్టర్లు ఉండవలసిన ప్రదేశంలో ఒకే డాక్టర్ ఉంటే పూర్తిస్థాయిలో వైద్యం అందించినట్లా???
ఈ సీజన్ కాలంలోనైనా రాత్రి వేళ కొమరాడ మాదలింగి రాంబద్రపురం ప్రాథమిక ఆరోగ్యంద్రాలో డాక్టర్ అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి
కొమరాడ మండలానికి సంబంధించి మాదిలింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి
ఇలాంటి సందర్భంలో వెంటనే మాదలంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓకే డాక్టర్ ఉంటున్నారు కావున గతంలో మాదిరిగా రెండవ డాక్టర్ని వెంటనే నియమించాలని అలాగే ఈ సీజన్ కాలంలో కొమరాడ మండలంలో గల కూనే రూ రామభద్రపురం మాదలింగి కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రాత్రి వేళ గిరిజన గ్రామాలు నుండి వస్తున్న రోగులకు అన్ని విధాలుగా వైద్యం అందించే విధంగా అందుబాటులో ఉండాలని కోరుతూ శనివారం మాదలింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం పొందుతున్న రోగులను పరిశీలించిన అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నుండి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నాయకులు హెచ్ రామారావు మాట్లాడుతూ మాట్లాడితే ఐటిడిఏ అధికారులు జిల్లా స్థాయి వైద్య శాఖ అధికారులు గిరిజన ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని పత్రిక ప్రకటనలు ఇవ్వడమే తప్ప మాదిలింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండవ డాక్టర్ నియమించడంలో నిర్లక్ష్యం అంతా ఇoత కాదని ఈ సందర్భంగా తెలియజేయుచున్నాము ఎందుకంటే మాదిలింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సుమారు 10 నుండి 15 కిలోమీటర్ల దూరం నుండి గిరిజన ప్రజలు వైద్యం కోసం వచ్చే పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో ఒకే డాక్టర్ ఉంటే ఎలా వైద్యం అందుతుందని గతంలో ఇద్దరు డాక్టర్లు ఉండేవారిని ప్రతిరోజు ఓపి కూడా బాగా వస్తున్న నేపథ్యంలో వెంటనే 2వ డాక్టర్ని నియమించాలని అలాగే ఈ సీజన్ కాలంలో రాత్రివేళ అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందే విధంగా డాక్టర్ ని కూడా పైన తెలిపిన మూడు ప్రాథమిక ఆరోగ్యంద్రాలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టి అన్ని విధాలుగా గిరిజన ప్రజలకు వైద్యం అందించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ కి విన్నవించుకుంటున్నాము
మాదలింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రోగులను పరిశీలించిన ఫోటో మరియు పత్రిక విలేకరులతో మాట్లాడుతున్న ఫోటో వీడియో చూడగలరు