Site icon PRASHNA AYUDHAM

కీసర 108 అంబులెన్స్‌పై జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఆకస్మిక తనిఖీ

IMG 20250625 WA2294

*కీసర 108 అంబులెన్స్‌పై జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఆకస్మిక తనిఖీ*

*సిబ్బంది సేవలను ప్రశంసించిన భూమా నాగేందర్*

మేడ్చల్ జిల్లా కీసర ప్రశ్న ఆయుధం జూన్ 25

మేడ్చల్ జిల్లా, కీసర మండల పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిలిపివున్న 108 అత్యవసర వైద్య వాహనంపై నూతన జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్ బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వాహనంలోని సిబ్బంది విధి నిర్వహణ, వైద్య పరికరాల పరిస్థితులు, అత్యవసర మందుల నిల్వలపై ఆయన సమగ్రంగా సమీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా భూమా నాగేందర్ మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే వైద్య పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్న అంశాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు. అలాగే మందుల స్టాక్ రికార్డులను పరిశీలించి, అవసరమైన మెడికల్ పరికరాలు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

కీసర 108 అంబులెన్స్ సిబ్బంది అత్యవసర సేవలలో చూపుతున్న నిబద్ధతపై ఆయన మెచ్చుకున్నారు. డెలివరీ సమయంలో ప్రసవాలు అంబులెన్స్‌లోనే నిర్వహించి మాతా శిశువుల ప్రాణాలను రక్షించిన ఘటనలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఈఎంటి చిత్రం రవి మరియు పైలట్ రాంబాను ప్రత్యేకంగా అభినందించారు.

108 సేవల ప్రధాన లక్ష్యం ప్రజలకు అత్యవసర సమయంలో సమయానికి వైద్య సహాయాన్ని అందించడం అని గుర్తుచేసిన ప్రోగ్రాం మేనేజర్, కీసర 108 సిబ్బంది మంచి సేవా భావంతో పనిచేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.

Exit mobile version