మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభించిన జిల్లా ఎస్పీ
యం. రాజేశ్ చంద్ర ఐపిఎస్
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 21
నేరానికి సంబంధించి సంఘటన స్థలంలోని సాక్ష్యాధారాలను సేకరించి నిందితులను గుర్తించడంలో ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం కామారెడ్డి జిల్లా కు నూతనంగా మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని అందజేసారు. ఈ వాహనాన్ని జిల్లా ఎస్పి యం. రాజేశ్ చంద్ర ఐపిబఎస్ జిల్లా పోలీసు కార్యాలయములో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, అత్యాధునిక పరికరాల తో రూపోందించబడిన ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనాని కామారెడ్డి జిల్లా పోలీసులకు మరింత మెరుగైన సేవలందించనున్నది. ఇకపై ఎదైనా నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్ అధికారులు, సిబ్బంది ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనంలో చేరుకోని సంఘటన జరిగిన స్థలం నుండి పలు రకాల సాక్ష్యాదారాలను సేకరించి ఈ మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలతో పరీక్షలను నిర్వహించి సంబంధిత దర్యాప్తు అధికారికి ప్రాథమిక సాక్ష్యాధారాలను అందజేయడం జరుగుతుందని జిల్లా ఎస్పి, తెలియజేసారు.
ఈ కార్యక్రమములో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పి చైతన్య రెడ్డి, ఐపిఎస్, డీఎస్పీలు శ్రీనివాస్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సిఐలు, మరియు ఎస్ఐలు, క్లూస్ టీమ్, తదితరులు పాల్గొన్నారు.