వివాహాలు, శుభ కార్యాలయాల్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కేసులు నమోదు చేయండి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

*రోజు రోజుకు మితిమీరుతున్న హిజ్రాల ఆగడాలకు చెక్..*

*అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 60 మంది హిజ్రాలకు కౌన్సెలింగ్.*

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): వివాహాలు, శుభ కార్యాలయాల్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కేసులు నమోదు చేయాలని, అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 60 మంది హిజ్రాలకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశానుసారం అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సుమారు 60-మంది హిజ్రాలకు అమీన్పూర్ ఎస్‌హెచ్‌ఓ నరేష్, ఇన్స్పెక్టర్ కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. వివాహాలు, శుభ కార్యాలయాలు, ఇతర ప్రజా ప్రదేశాలలో ప్రజలను బయబ్రాంతులకు గురి చేస్తూ, నేర పూరిత చర్యలకు దిగుతూ ఇబ్బందులకు గురి చేస్తూ బలవంతపు డబ్బు వసూలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. చట్టానికి లోబడి, సమాజంలో అందరిలా సాదారణ జీవన విధానాన్ని అనుసరించాలని సూచించారు. శుభ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, ఇళ్లకు వెళ్లి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ, నేర పూరిత చర్యలకు దిగుతూ బలవంతపు డబ్బు వసూలు చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడినట్లయితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కేసులు నమోదు చేయాలని ఎస్‌హెచ్‌ఓలకు ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగినట్లయితే, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment