Site icon PRASHNA AYUDHAM

ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

IMG 20250818 210644

Oplus_131072

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 18 (ప్రశ్న ఆయుధం న్యూస్):సంగారెడ్డి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విని, తక్షణ పరిష్కారం కోసం సంబంధిత యస్.హెచ్.ఓ.లకు ఫోన్ ద్వారా మాట్లాడి, వారి సమస్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చట్టాన్ని అమలు పరచడంలో ఎలాంటి అలసత్వం చూపరాదని, చట్టప్రకారం కేసులను పరిష్కరించాల్సిందిగా యస్.హెచ్.ఓ.లకు సూచనలు చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యకు పరిష్కారం దొరకని సందర్భంలో నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలకు తావు లేకుండా స్వచ్చంధంగా జిల్లా పోలీసు కార్యాలయ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించేందుకు, సత్వర న్యాయం చేసేందుకు, పోలీసుశాఖ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని జరుగుతుందని, జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలసిందిగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు.

Exit mobile version