ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షా కేంద్రాన్ని సందర్శించినా జిల్లా ఎస్పి
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర గురువారం జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, బందోబస్తు ఏర్పాట్లు సమీక్షించి, సిబ్బందికి కీలక సూచనలు అందజేశారు. కామారెడ్డి టౌన్లోని సాందీపని కాలేజీ పరీక్షా కేంద్రాన్ని స్వయంగా సందర్శించి, అక్కడ ఉన్న భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా సమయంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచనలను ఇచ్చారు. ఈ సందర్భంగా, పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండి, శాంతి భద్రతల పరిరక్షణకు తగిన చర్యలు త్వరితంగా తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు.