వార్షిక తనిఖీల్లో భాగంగా జుక్కల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ 

 

*వార్షిక తనిఖీల్లో భాగంగా జుక్కల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

* పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి.*

* కేసుల నమోదు, రికార్డుల నవీకరణ సక్రమంగా నిర్వహించాలి.*

* పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను, రిసెప్షన్, రికార్డ్, రైటర్ రూమ్ పరిశీలించారు.*

* అన్ని ప్రార్థన స్థలాలలో, దేవాలయం, బ్యాంకులో సీసీ కెమెరాలు తప్పనిసరి.*

* కర్ణాటక మరియు మహారాష్ట్రతో సరిహద్దుతో ఉన్నందున అసాంఘిక కార్యకలాపాలకు ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా పూర్తిగా రూపుమాపాలని జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ తెలిపినారు.*

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐపిఎస్  సూచించారు. ఈరోజు వార్షిక తనిఖీలో భాగంగా జుక్కల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని, బాధితులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ ని సంప్రదించవచ్చని అన్నారు. నేరాల నివారనే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు.పాత నేరస్థులపై నిఘా ఉంచాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు, ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకుంటూ ప్రజలకు యువతకు ప్రత్యేకంగా సైబర్ నేరాల నివారణ పై చైతన్యాన్ని తీసుకురావాలని సూచించారు.

ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న కేసులపై రివ్యూ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల నమోదు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వారి యొక్క డ్యూటీల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉండేటట్లు అదేవిధంగా ఫైల్స్, క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు.రికార్డ్ రూమ్, రైటర్ రూమ్ తదితర అన్నివిభాగాలు తిరిగి క్షుణ్నంగా పరిశీలించారు.

అనంతరం సిబ్బంది తో మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ అంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని, విలేజ్ పోలీసింగ్ ఆఫీసర్ తనకు కేటాయించిన గ్రామాన్ని తరచూ సందర్శించి, గ్రామ పరిస్థితులపై పూర్తి సమాచారం సేకరించాలి మరియు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి, నేరాల నివారణకు చురుగ్గా పనిచేయాలని సూచించారు. పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలని సూచించారు.

జుక్కల్ స్టేషన్ కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ప్రాధాన్యత గల ప్రాంతమని జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర IPS తెలిపారు.భద్రతను బలోపేతం చేయడం కోసం జుక్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని బ్యాంకులు, మందిరాలు, దేవాలయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు మరియు అలారంలు ఏర్పాటు చేయాలని, ఇందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్ఐ ని ఆదేశించారు.ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పి విట్టల్ రెడ్డి, బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ జుక్కల్ ఎస్ఐ భువనేశ్వరూ సిబ్బంది పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment