ఉండవల్లిలో చంద్రబాబు దంపతుల దీపావళి సంబురాలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో దీపావళిని కుటుంబసభ్యులతో కలిసి జరుపుకున్నారు.
సతీమణి భువనేశ్వరి సమక్షంలో పూజలు నిర్వహించారు.
దీపాల వెలుగులో నివాసం కాంతులీనగా ముస్తాబైంది.
సిబ్బంది, బంధుమిత్రులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల జీవనంలో వెలుగు నిండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరితో కలిసి ఉండవల్లి నివాసంలో దీపావళి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. సాయంత్రం వేళ సాంప్రదాయ విధానంలో పూజలు నిర్వహించి, అనంతరం దీపాలు వెలిగించారు.
చంద్రబాబు దంపతులు సిబ్బంది, బంధువులకు స్వీట్లు పంచి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ సంతోషం, శాంతి, సుభిక్షం నిండిన దీపావళి కావాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు.