Site icon PRASHNA AYUDHAM

ప్రతిపక్షాల కుట్రలకు బలి అవ్వద్దు

కుట్రలకు

ప్రతిపక్షాల కుట్రలకు బలి అవ్వొద్దు భవిష్యత్ తరాల అభివృద్ధికై సహకరించండి 

 

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 22:శేరిలింగంపల్లి ప్రతినిధి 

 

హైదరాబాద్ నగరంలోని నీటి వనరులు వాటి యొక్కఆక్రమణలపై తెలంగాగా ప్రజా ప్రభుత్వం తీసుకుటున్న చర్యలపై శేరిలింగంపల్లి నియోజకవర్గం పిసిసి ప్రతినిధి సత్యం రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు నిజనిజాలు వివరించే ప్రయత్నం చేయడం ద్వారా ప్రజల్లో ప్రజా ప్రభుత్వంకు అలాగే కాంగ్రెస్ పార్టికి ఉన్న చిత్తశుద్ధిని వివరించారు

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం పురాతన కాలం నుండి కాకతీయుల దగ్గర నుండి నిజాం రాజుల పరిపాలన వరకు తాగునీటి అవసరాలకు సాగునీటి అవసరాలకు ఎన్నో గొలుసుకట్టు చెరువులను నిర్మించారు స్వాతంత్ర్యం వచ్చినతరువాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల ఆధ్వర్యంలో బహుళార్థక సాధక ప్రాజెక్టులు నిర్మించారు అప్పటి హైదరాబాద్ ను సిటి అఫ్ లేక్స్ గాకూడా పిలుస్తారు హైదరాబాద్ నగరంలోని మూసినది నగరవాసుల తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా సాగుకు కూడా ఉపయోగకరంగాఉండేది 

గత ఈ కొన్ని దశాబ్దాల కాలంగా వేగవంతమైన అభివృద్ధి నగరంలోని చెరువులు మూసిపరివాహక ప్రాంతాలు అక్రమణకు గురై నగరంలోని చాలా ప్రాంతాలు ముంపుకు 

గురి కావడం జరుగుతుంది

దీనివల్ల ప్రజల జీవనప్రమాణాలు దెబ్బతినే పరిస్థితివచ్చిందిఅందువల్ల ఈ సమస్యలకు శాశ్వతపరిష్కారానికై తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో మరో స్థాయిలో నిలపాలంటే హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ మేటి నగరాల సరసన నిలబెట్టాలన్న సదుద్ధేశంతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం హైడ్రా కమిషన్ మూసి రివర్ ఫ్రంట్ ఏర్పాటుచేయడం జరిగింది హైడ్రా హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం చెరువుల యొక్క ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్ ల పరిధిని ఆక్రమణలకు గురికాకుండా చూసుకోవడం మరియు అక్రమ నిర్మాణలను తొలగించి వాటి పరిధిని పునర్వినియోగంలోకి తీసుకురావడం మూసి పరివాహక ప్రాంతం మొక్క అభివృద్ధిని జరపడం ద్వారా నగరానికి పెట్టుబడుల సమీకరణ అహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించి హైదరాబాద్ నగర వాసుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం వాటితో పాటు కొన్ని వేల ఉద్యోగాల రూపకల్పన జరుగుతుంది

ప్రతిపక్షాల కుట్ర 

రాష్ట్రంలో బిఆర్ ఎస్ బిజెపిలు కలిసి హైడ్రా చర్యలను తప్పుపడుతూ కబ్జాదారులకు అవినీతిపరులకుఅండగా ఉంటూ నగర భవిష్యత్తును అంధకారంలో ఉంచేందుకు కుట్ర పన్నుతున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేస్తానని ఆకాశహార్మ్యాలు నిర్మిస్తానని చెప్పి ప్రజలను మభ్యపెట్టారు కాని ఇప్పటి వరకు దాని గురించి పట్టించకున్న పాపాన పోలేదు నగరంలో ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు కేవలం వారి పార్టీ మనుగడకు వారి రాజకీయ స్వప్రయోజనాల కోసం తప్ప ప్రజల శాశ్యత అభివృద్ధి కాంక్షను కోరుకునే విధంగా లేవు అని పిసిసి ప్రతినిధి సత్యంరావు అన్నారు.

Exit mobile version