Site icon PRASHNA AYUDHAM

కుల గణనకు ఉపాధ్యాయులు వినియోగించవద్దు

IMG 20241109 WA0285

 

ఒక్క పూట తో చదువులు సాగేదెలా

ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులను వినియోగించి ఒక పూట బడులు నిర్వహించడం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడానికేనని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ ఆరోపించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే చేయడం కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులను ఉపయోగించడం అందుకోసం ప్రాథమిక పాఠశాలలో ఈనెల 6 నుండి 30 వరకు ఒక్క పూట నిర్వహించడం జరుగుతుందని అన్నారు దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు విద్యాబోధన సరికాంతకపోవడం కాకుండా ప్రభుత్వ పాఠశాల విద్యపై పెను ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యను నిర్వీణం చేయడానికి కుల గణనకు ఉపాధ్యాయులను ఉపయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని. ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కులగణనకు ఉపాధ్యాయులను ఉపయోగించకుండా ఇతర ఉద్యోగుల ద్వారా కుల గణన సర్వే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

Exit mobile version