హరి ఓం – – *ఉడుపి హోటల్ ఎందుకంత పేరుగాంచాయో తెలుసా*
ఇంట్లో మనం నలుగురికి లేదా 5గురికి వంట చేయగలం.అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెము కష్టమైన పని.
మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు.
మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరు?
*ఆసక్తికరమైన ఈ విషయం తెలుసుకుందామా.*
మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి 50లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు.
*కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొన లేదు*.
అందులో ఒకరు *విదర్భ రాజైన రుక్మి*
*రెండవది బలరాముడు*.
దక్షిణ భారతంలోని *ఉడిపి రాజ్యం* కురుక్షేత్ర యుద్ధానికివచ్చింది.
ఉడిపిరాజైన నరేషుడు
సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని మరో వైపు పాండవులు తమవైపు నిలబడాలని కోరుతారు
అప్పుడు *ఉడిపి* రాజు తన తెలివితో ఎటూ వెళ్ళకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు.
అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా?
*ఎవరు వండి పెడతారు?* అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు.
మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు.
అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది,
నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు.
అందువల్ల నేను,నా సైన్యం ఇరువర్గాల యుద్ధంలో పాల్గొనము.వారందరికి భోజనం చేసి పెడతాము అని *ఉడిపిరాజు* చెపుతాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతమైనది,50 లక్షల మందికి భోజనం వండటం,అంటే మామూలు మాటలు కాదు. ఇది మీ వల్లే సాధ్యమవుతుంది,
అందరికీ భోజనాలు తయారుచేయమని చెపుతాడు.
*50 లక్షల* మందికి భోజనాలు వండాలంటే
భీముడు మరియు అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది కానీ ఈ సమయంలో పోరాడటం
భీముడుకు ముఖ్యం.
అందువల్ల భీముని యుద్ధక్షేత్రం వదిలి రాలేడు.అందువల్ల నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్ధుడు అని వంట వండమని కోరతాడు శ్రీ కృష్ణుడు.
నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు నరేష్ ఎలా వండేవాడు అంటే..
సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా,వృధాకాకుండా వండేవాడు.
రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడాతగ్గిపోయ్యేది.
అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా
వండేవాడు నరేశుడు.
ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయోవారు.*ఇది ఎలా సాధ్యం?* అంత మంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంటచేస్తున్నారు,
అది కూడా ఒక్క మెతుకు కూడా, మిగలకుండా ఎలా వండుతున్నారు అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు.
అసలు నరేశునికి ఎలా తెలుస్తుంది?
ఈ రోజు ఇంతమంది మాత్రమేచనిపోతారని,
మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని?..
*ఇలా18 రోజులు గడిచిపోయాయి.పాండవులు గెలిచారు*.
పట్టాభిషేకంజరుగుతుంది.అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడుని అడుగుతాడు.. మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామనిపొగుడుతున్నారు.
కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నానుఅనిఅంటాడు.
ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యమునకు వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక మెతుకు కూడా మిగలకుండా వృధాకాకుండా వండడం అంటే మాటలు కాదు.
*ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేశావు?* అని అంటాడు.
అప్పుడు నరేష్ మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా *శ్రీకృష్ణుడే కారణం*. కాబట్టి ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణుని కే చెందుతుంది అని చెప్తాడు.
*శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసరకాయలు తినేవాడు.,*
నేను లెక్క పెట్టి పెట్టే వాడిని. శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్లీ పెసరకాయలను
లెక్కపెట్టే వాడిని,
శ్రీ కృష్ణుడు ఎన్ని కాయలుఅయితే తింటాడో దానికి వెయ్యిరెట్లు సైన్యం చనిపోయేవారు..
ఆంటే శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు.
దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండే వాడిని అని చెప్పాడు.
ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండే వాడిని అని చెప్పాడు.
ఇది విని ఆ సభలోని వారందరూ *కృష్ణలీల* కు ముగ్ధులు అవుతారు. ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు.🙏🙏🙏🙏