Site icon PRASHNA AYUDHAM

తిరుమ‌ల‌లో శుక్రవారం అభిషేకం వేళలో పునుగు పిల్లి తైలాన్ని శ్రీ‌వారికి ఎందుకు రాస్తారో తెలుసా ?

IMG 20250622 WA1149

తిరుమ‌ల‌లో శుక్రవారం అభిషేకం వేళలో పునుగు పిల్లి తైలాన్ని శ్రీ‌వారికి ఎందుకు రాస్తారో తెలుసా ?

ఈ భూమి మీద ఉండే వివిధ ర‌కాల జంతువుల్లో పునుగు పిల్లి కూడా ఒక‌టి. దీనిని ఆంగ్లంలో టాడీ క్యాట్ అని సివియ‌ట్ క్యాట్ అని పిలుస్తారు. పునుగు పిల్లుల్లో సుమారు 38 జాతుల వ‌ర‌కు ఉన్నాయి. ఆసియా ర‌కానికి చెందిన పునుగు పిల్లుల్లో ఒక విశిష్ట‌త ఉంటుంది. ఈ జాతుల‌కు చెందిన పునుగు పిల్లుల గ్రంథుల నుండి పునుగు తైల‌మ‌నే సుగంధ ద్ర‌వ్యం ల‌భిస్తుంది. ఈ తైలాన్నే వెంక‌టేశ్వ‌ర స్వామి విగ్ర‌హానికి రాస్తారు. ఈ పునుగు తైలం స్వామి వారికి ఎంతో ఇష్ట‌మైన తైల‌మ‌ని చెబుతుంటారు.

శుక్ర‌వారం అభిషేకం త‌రువాత స్వామి వారి మూల విరాట్ కు పునుగు తైలాన్ని లేప‌నంగా రాస్తారు. ఈ తైలం కార‌ణంగానే స్వామి వారి విగ్ర‌హం చెక్కు చెద‌ర‌కుండా నిగ‌నిగ‌లాడుతూ ఉంటుందని పండితులు అంటున్నారు. పునుగు పిల్లికి రెండు సంవ‌త్స‌రాల వ‌య‌సు రాగానే ప్ర‌తి రోజుల‌కు ఒక‌సారి గంధం చెట్టుకు త‌న శ‌రీరాన్ని రుద్దుతుంది. ఆ స‌మ‌యంలో దీని చ‌ర్మం నుండి వెలువ‌డే స్రావం ఆ చెట్ల‌కు అంటుకుంటుంది. ఆ చెట్ల నుండి సేక‌రించ‌బ‌డిన స్రావమే పునుగు తైలం.

ప్ర‌స్తుతం అంత‌రించిన పోతున్న పునుగు పిల్లుల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వారు సంర‌క్షించి వాటి నుండి తైలాన్ని సేక‌రిస్తున్నారు.

Exit mobile version