*టీటీడీకి వెండి దీపపు సమ్మెలు విరాళం*
తిరుమల, 2025 మే 10: టీటీడీకి శనివారం రాత్రి నాలుగు వెండి దీపపు సమ్మెలు విరాళంగా అందాయి.
బెంగుళూరుకు చెందిన శ్రీ రాధా కృష్ణ, శ్రీ శ్యామ్ సుందర్ శర్మ, శ్రీ శశిధర్ ఈ దీపపు సమ్మెలను విరాళంగా అందించారు.
శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద పేష్కార్ శ్రీ రామకృష్ణకు దాతలు ఈ మేరకు దీపపు సమ్మెలను అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.