ఆలయ అభివృద్ధికై విరాళం
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి, మాచారెడ్డి
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ గుడి అభివృద్ధికి సికింద్రాబాద్ వాసి ఆర్థిక సాయం అందించారు.
మాచరెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికై సికింద్రాబాద్ అల్వాల్ వాసులు గునుగంటి నరసింగరావు, అరుణ బుధవారం రూ.11,116/-రూపాయలను విరాళంగా అందజేశారు. విరాళాన్ని ఆలయ చైర్మన్ కమలాకర్ రెడ్డి, కార్య నిర్వాహక అధికారి శ్రీధర్ రావు కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పురోహితులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.