

గద్వాల జిల్లా కేంద్రంలోని 16వ వార్డు పరిధిలోని రెవెన్యూ కాలనీలో గల శ్రీభీమలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన గణనాథుడికి భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం గణేష్ మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని అన్నదాత రియల్ ఎస్టేట్ మధు ముదిరాజ్ ప్రారంభించారు. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని ఆయన అన్నారు. ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, భీంనగర్ ప్రజలు, రెవెన్యూ కాలనీ యూత్ పాల్గొన్నారు…