Site icon PRASHNA AYUDHAM

దాతలను ప్రోత్సహించిన సదాశియఫౌండేషన్

IMG 20241017 WA0129

*ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో 50వేల కార్నియా మార్పిడి శస్త్ర చికిత్సలు చేసి రికార్డు*

*దాతలను ప్రోత్సహించిన సదాశియ ఫౌండేషన్*

 

*కరీంనగర్ అక్టోబర్ 17 (ప్రశ్న ఆయుధం)*

 

ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో దాతల కార్నియాతో 50 వేల కార్నియా మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు సదాశయ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు హైదరాబాదులోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో 50వేల కార్నియా మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించి రికార్డు సాధించిందని రికార్డు సాధనకు సదాశియ ఫౌండేషన్ కృషి వెలకట్టలేనిదని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి పిలుపు మేరకు సదాశివ ఫౌండేషన్ జమ్మికుంట ఓదెల గోదావరిఖని హనుమకొండ కమాన్ పూర్ అబ్బిడిపల్లి కన్నాల ప్రతినిధులు హాజరు కావడం జరిగిందని తెలిపారు 50వేల కార్నియా మార్పిడి శస్త్ర చికిత్సలు జరగడానికి సహకరించిన వివిధ ప్రాంతాల సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులకు చైర్మన్ డాక్టర్ గుల్లపల్లి నాగేశ్వరరావు ఐ బ్యాంక్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సునీత దాస్ నెట్వర్క్ డైరెక్టర్ డాక్టర్ సుజాత లు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి రాష్ట్ర ప్రచార కార్యదర్శి కె.యస్ వాసు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు యం.నరహరి లయన్స్ క్లబ్ కమాన్ పూర్ ప్రధాన కార్యదర్శి శంకర్ ప్రతినిధులు పృథ్విరాజ్ జి.వెంకటేశ్వర్లు, ఎం జగదీశ్వర్,వేణు, సంతోష్, శంకర్, చంద్రశేఖర్ అబ్బిడిపల్లి మాజీ సర్పంచ్ ఒజ్జ కోమల శ్రీనివాస్ లను చైర్మన్ డాక్టర్ గుల్లపల్లి నాగేశ్వరరావు ప్రశంసా పత్రంతో సత్కరించి అభినందించారు

Exit mobile version