విద్యార్థినులను లైంగికంగా వేధించి వారి భవిష్యత్తును అంధకారం చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న కీచక టీచర్ గోపీనాథ్ మా పాఠశాలకు వద్దు అంటూ కురబలకోట మండలం ముదివేడు గ్రామ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం ఉదయం ఆ పాఠశాల ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లి, దండ్రులు మాట్లాడుతూ గతంలో మదనపల్లి లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని ని లైంగికంగా వేధించినందుకు గోపీనాథ్ మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అంతకుముందు కలకడ మండలంలోని నడించెర్ల ఉన్నత పాఠశాలలో కూడా ఆయన అమ్మాయిల పట్ల లైంగికంగా వేధించి శిక్షకు గురైనాడని వారు అన్నారు. అలాంటి టీచర్ మాకొద్దు అంటూ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి వినతి పత్రాన్ని అందజేశారు. అంతేకాకుండా అతను పని చేసిన ప్రతి పాఠశాలల్లోనూ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని,గతంలో కూడా అమ్మాయిలను హార్స్ లీ హిల్స్ తీసుకెళుతుండగా పోలీసులు పట్టుకోవడం జరిగిందన్నారు. ఇలాంటి కామాంద, కీచక ఉపాధ్యాయుడు మాకొద్దు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖ అధికారి, మదనపల్లి ఉప విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.