“మత్తులో పడి చిత్తు కావొద్దు..!”

*మత్తుమందులో పడి చిత్తు కావద్దు*

*సైబర్ మోసాలపై మీ తల్లిదండ్రులకు అవగాహన కల్పించండి*

*మంచి భవిష్యత్తు కొరకు మంచి మార్గాన్ని ఎంచుకోండి*

*విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన*

*విద్యార్థుల సమూహంలో హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 27*

విద్యార్థి దశ నుండే కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాలను మలుపు తిప్పుతుందని విద్యార్థుల సమావేశంలో హుజురాబాద్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ జి అన్నారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో డ్రగ్స్, సైబర్ నేరాల పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఏసీపీ శ్రీనివాస్ జీ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ప్రతి ఒక్క యువకుడు మంచి అలవాట్లను అలవర్చుకోవాలని మీరు వేసే అడుగు మీ జీవితాన్ని మార్పు చేస్తుందని ఇది గమనించి బంగారు భవిష్యత్తు కొరకు మంచి పునాది నిర్మించుకొని జీవితంలో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్ మనిషిని మృగాన్ని చేస్తాయని మొదట హాయిగానే ఉంటుందని ఆ తర్వాతే పతనం ప్రారంభమవుతుందని డ్రగ్స్ కు బానిస అయితే మీరు నాశనం అవడమే కాకుండా మీ కుటుంబాన్ని కూడా నాశనం చేసినవారు అవుతారని మత్తుమందులో పడి చిత్తులు కావద్దని ఏసీపి విద్యార్థులకు తెలిపారు. సమాజంలో రోజు రోజుకు జరుగుతున్న సైబర్ మోసాలను మీరు చూస్తున్నారని సైబర్ కేటుగాళ్లకు మహా మేధావులే బలైపోతున్నారని అలాంటిది కేవలం వ్యవసాయo మీద ఆధారపడి జీవించే ఒక రైతు మోసపోవడం పెద్ద సమస్య కాదని అన్నారు. మీరంతా కూడా రైతు నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చిన విద్యార్థులు ఎక్కువగా ఉన్నారని మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకు సైబర్ నేరాల పట్ల జరుగుతున్న మోసాలను వివరించి చెప్పాలని వారికి సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలను బ్యాంకు అకౌంట్ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలను బ్యాంకు అకౌంట్ ద్వారా అందచేస్తారని వారి ఖాతాలో డబ్బు జమ కాగానే కేటుగాళ్లు వల పన్నుతారని రైతును మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తారని వాటికి మీ తల్లిదండ్రులు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలని వారికి తెలిపారు. ముఖ్యంగా మనిషి జీవితంలో సెల్ఫోన్ ఒక భాగం అయిపోయిందని దానిని మంచికి వినియోగించుకుంటే నష్టం లేదని అనవసరమైన యాప్స్ డౌన్లోడ్ చేసుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దని ఇప్పటికే ఎంతోమంది ఆన్లైన్ గేమింగ్ ద్వారా లక్షల రూపాయలు అప్పులు చేసి ప్రాణాలు తీసుకున్నా ఘటనలు ప్రతిరోజు చూస్తున్నామని మీరు కూడా అలాంటి వాటి ఉచ్చులో పడకూడదని వారికి తెలిపారు. మీ నడవడిక మంచిగా ఉంటే మీ కుటుంబ బాగుంటుందని మీపై నమ్మకం పెట్టుకున్న మీ తల్లిదండ్రులను ఎలా రక్షించుకుంటారో అది మీ మీదనే ఆధారపడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి ఎస్సై టి వివేక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ బాబు చాణిక్య డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ దబ్బేట రవీందర్ పలువురు పోలీస్ సిబ్బంది సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now