Site icon PRASHNA AYUDHAM

ఆర్టిఐ పై పారదర్శకత ఉండాలి  డాక్టర్ చంటి ముదిరాజ్

IMG 20250622 WA2283

*ఆర్టిఐ పై పారదర్శకత ఉండాలి*

*డాక్టర్ చంటి ముదిరాజ్*

*సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు*

ప్రశ్న ఆయుధం 22జూన్

హైదరాబాద్ బషీర్ బాగ్: సమాచార హక్కు చట్టం అమలుపై ప్రభుత్వానికి పారదర్శకత, అధికారులు జవాబుదారిగా ఉండాలని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి 33 జిల్లాల నుంచి ఆర్టిఐ సాధన కమిటీ సభ్యులు విచ్చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల నుంచి సహకారం లభించడం లేదన్నారు. అధికారుల్లో జవాబుదారితనం కొరవడిందన్నారు. సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో ఆ వ్యక్తికి కోరిన సమాచారం అందించాల్సిన బాధ్యత ఆయా అధికారులపై ఉందన్నారు. నిర్ణీత సమయంలోపు అందించకపోతే అప్పిలేట్ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చన్నారు. ఇక్కడా స్పందన రాకపోతే రాష్ట్ర సమాచార చట్టం చీఫ్ కమిషనర్ కు అప్పీల్ చేసుకోవాలన్నారు. కమిషన్ స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటుందన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును నిరాకరించే అధికారం ప్రభుత్వ వ్యవస్థలో ఏ శాఖ, అధికారికి లేదన్నారు. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చింతల రాఘవేంధర్ ముదిరాజ్, రాష్ట్ర కన్వీనర్ కిఫ్ఫాయాత్ అలీ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ దిలీప్ రావ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపీనాథ్ కట్టెకోల, రాష్ట్ర కార్యదర్శి చింతల క్రిష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వై కార్తీక్ రెడ్డి, బి లక్ష్మణ్, ఆర్ లక్ష్మణ్, వి గణేష్, వి శ్రవణ్ కుమార్, రామకృష్ణ, అశోక్, సిద్దిపేట జిల్లా కార్యదర్శి అన్నబోయిన ఆంజనేయులు, 33 జిల్లాల సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version