పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరామ్ ఘననివాళి..

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరామ్ ఘననివాళి.. 

IMG 20241013 WA0026 1

సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,తొండపి గ్రామ మాజీ సర్పంచ్, మాజీ మునుసుబు,రాయిడి వెంకటేశ్వర్లు పార్టీకి చేసిన సేవలు మరువలేనివని రాయిడి వెంకటేశ్వర్లు 32వ వర్ధంతి సందర్భంగా తాను చేసిన సేవలు కాక పార్టీ కోసం ఎంతో కష్టపడి చివరకు ప్రాణాలు సైతం లెక్క చేయక పార్టీ కోసం నిలబడిన వ్యక్తి అని అటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉండడం, అటువంటి మహనీయుల ఎంతో మంది ఉన్న పార్టీలో నేడు మనం అందరం పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని డాక్టర్ కోడెల శివరామ్ అన్నారు. రాయిడి వెంకటేశ్వర్లు వంటి ఎంతో మంది నాయకులు నేటితరం కార్యకర్తలకు ఆదర్శంగా నిలిచారు కనకే నేటికీ వారిని స్మరించుకుంటూ ఉన్నామని అటువంటి నాయకులు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటారని డాక్టర్ కోడెల శివరామ్ తెలిపారు.

Join WhatsApp

Join Now