Site icon PRASHNA AYUDHAM

తెలంగాణ రాష్ట్ర మైనార్టీ హక్కుల వ్యవహారాల చీఫ్ గా డాక్టర్ మొహమ్మద్ గాలిబ్

తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర మైనార్టీ హక్కుల వ్యవహారాల చీఫ్ గా డాక్టర్ మొహమ్మద్ గాలిబ్

ప్రశ్న ఆయుధం న్యూస్, డిసెంబర్ 9, కామారెడ్డి :

నేషనల్ నిమ్బుల్ హ్యూమన్ రైట్స్ అధిష్టానం కామారెడ్డి జిల్లా వాసి డాక్టర్ మొహమ్మద్ గాలిబ్ ను తెలంగాణ రాష్ట్ర మైనార్టీ హక్కుల వ్యవహారాల చీఫ్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు డాక్టర్ మొహమ్మద్ గాలిబ్ మీడియాకు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రస్తుతం మైనార్టీలలో వ్యక్తిగతంగా అన్యాయం జరిగినప్పుడు, సమాజంలో మైనార్టీ ఆడవాళ్లకు అన్యాయం జరిగిన ప్రేక్షక పాత్ర వహించడం కాకుండా మైనార్టీ ఆడవాళ్ళ హక్కులు, మగవారి హక్కులపై అవగాహన కలిగి ముందుకు ఎలా వెళ్లాలో కౌన్సెలింగ్ తీసుకోవాలని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నేషనల్ నెంబర్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ వారు సహాయం చేస్తారని తెలిపారు. ఎక్కడైతే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందో, ఎక్కడైతే ప్రజలు అన్యాయానికి గురవుతారో అట్టి విషయం తమ దృష్టికి తీసుకువస్తే ఖచ్చితంగా సంబంధిత అధికారులతో మాట్లాడి సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తానని డాక్టర్ మొహమ్మద్ గాలిబ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఈ గొప్ప అవకాశాన్ని అందించి తనపై నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర మైనార్టీ హక్కుల వ్యవహారాల చీఫ్ గా నియమించినందుకు నేషనల్ చైర్మన్ డాక్టర్ సిహెచ్ విజయమోహన్ రావు, నేషనల్ డిజిసి ఓఓ డాక్టర్ సిహెచ్ ప్రవీణ్ రావు, పిఏ డీజీఈఓ డిజిసి ఓఓ డిజిసి ఎఫ్ ఓ చామకూర రవీందర్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version