పీజేఆర్ నగర్ కాలనీ లో డ్రైనేజీ కంట్రోల్ మరమ్మత్తులు
చేయించన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 16: కూకట్పల్లి ప్రతినిధి
124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ కాలనీ లో డ్రైనేజీ కంట్రోల్ ట్యాంక్ పొంగి కాలనీలో నీరు వచ్చి ఇబ్బందిగా ఉందని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకునిరాగా కార్పొరేటర్ పీజేఆర్ నగర్ కాలనీ లో పాదయాత్ర చేసి సమస్యను స్వయంగా పరిశీలించి జి.ఎచ్.ఎం.సి సిబ్బందితో క్లియర్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మ్యాన్ హోల్స్ అన్ని క్లియర్ చేసి నిల్వఉన్న నీటిని బయటకు పంపాలని అలాగే కాలనీలో పెద్ద డ్రైనేజీ లైన్ నిర్మించి నీరు నిలిచిపోయే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మరేళ్ల శ్రీనివాస్, సంగమేష్, అగ్రవాసు, పోశెట్టిగౌడ్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, సూపర్వైజర్ శివ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.