Site icon PRASHNA AYUDHAM

ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి 

ఎమ్మెల్యే
Headlines
  1. ప్రజల సుఖసంతోషాల కోసం ఆంజనేయ స్వామి ఆశీస్సులు అవసరం
  2. భక్తి మార్గంలో పయనించాలని దుబ్బాక ఎమ్మెల్యే సూచన
  3. దౌల్తాబాద్ లో శివ పంచాయతన ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం
  4. ఆధ్యాత్మికతతో ప్రజల ప్రశాంతత: దుబ్బాక ఎమ్మెల్యే స్పష్టం
  5. ఆలయ నిర్మాణంలో భాగస్వాములైన కమిటీ సభ్యులకు సన్మానం

ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో పయనించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఆంజనేయ సహిత శివ పంచాయతన నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభయానికి మారుపేరుగా నిలిచే ఆంజనేయస్వామి ఆరోగ్య దైవమని అన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రహీముద్దీన్, నియోజకవర్గ బీసీ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఆంజనేయులు గౌడ్, చంద్రారెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు…..

Exit mobile version