నెహ్రూ స్వార్థ రాజకీయాల వల్లే నాడు దేశం రెండు ముక్కలైంది

నెహ్రూ స్వార్థ రాజకీయాల వల్లే నాడు దేశం రెండు ముక్కలైంది

నెహ్రూ స్వార్థ రాజకీయాల వల్లే నాడు దేశం రెండు ముక్కలైంది

దేశ విభజన సమయంలో లక్షలాది హిందువులు ఊచకోతకు గురయ్యారు

కాంగ్రెస్ విభజన రాజకీయాలు దేశానికి ప్రమాదకరం

బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను బీజేపీ ఖండిస్తుంది

బిజేపి జిల్లా అధ్యక్షురాలు అరుణా తార

ప్రశ్న ఆయుధం 14ఆగష్టు కామారెడ్డి :
బిజేపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కార్యాలయంలో దేశ విభజన గాయాల స్మారక దినం కార్యక్రమం అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించరు .
ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తార మాట్లాడుతూ నెహ్రూ స్వార్థ రాజకీయాల వల్లే నాడు దేశం రెండు ముక్కలైందనీ తాను ప్రధాని కావడం కోసమే దేశ విభజనకు అంగీకారం తెలిపాడని అన్నారు. దేశ విభజన సమయంలో లక్షలాది హిందువులు ఊచకోతకు గురయ్యారని ఆ గాయాలను నేటికీ భారతదేశం మరవలేదని అన్నారు. అందుకే నిన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశ విభజన గాయలబ్ స్మారక దినం గా ఆగస్టు 14 రోజున అప్పుడు ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించాలని సూచించారని అన్నారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలు దేశానికి ప్రమాదకరం అని అన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను బీజేపీ ముక్త కంఠం తో ఖండిస్తుందని అన్నారు. హిందువులకు మద్దతుగా CAA చట్టాన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని గుర్తు చేశారు.కార్యక్రమం అనంతరం నాడు విభజన సందర్భంగా చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తూ మౌనం పాటించరు .

నెహ్రూ స్వార్థ రాజకీయాల వల్లే నాడు దేశం రెండు ముక్కలైంది
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వీపుల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీకాంత్, కౌన్సిలర్ శ్రీనివాస్, నరేందర్, నాయకులు సంతోష్ రెడ్డి, వెంకట్, వేణు, సంద్య, అనిత, నరేష్, రఘు, రజినీకాంత్, రవీందర్, గంగాధర్, గోవర్ధన్, విజయ్, రాజగోపాల్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now