తెలంగాణ అవతరణ దినోత్సవం కారణంగా జూన్ 2న ప్రజావాణి రద్దు

**తెలంగాణ అవతరణ దినోత్సవం కారణంగా జూన్ 2న ప్రజావాణి రద్దు**

**కలెక్టరేట్‌లో వేడుకల నేపధ్యంలో జిల్లా కలెక్టర్ గౌతం ప్రకటన**

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం మే 31

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2, సోమవారం నాడు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఈసారి రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ గౌతం ఒక ప్రకటనలో తెలిపారు.అదే రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లావాసులెవ్వరూ అనవసరంగా కలెక్టరేట్‌కు రాకండని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment