దుర్కి ట్రైబల్ వెల్ఫేర్ లెక్చరర్ అనుమానస్పద మృతి
ప్రశ్న ఆయుధం 21 జూన్ (బాన్సువాడ ప్రతినిధి)
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ లో స్వప్న అనే పార్ట్ టైం కెమిస్ట్రీ లెక్చరర్ అనుమానాస్పద మృతి చెందింది.మోర్తాడ్ మండలం గాండ్లపేట గ్రామానికి చెందిన స్వప్న గత మూడు సంవత్సరాలుగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లో కెమిస్ట్రీ పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేస్తుంది. నిన్న పొద్దున కోదాడలో టెట్ ఎగ్జామ్ రాసి వచ్చి నిన్న నైట్ లో డ్యూటీ చేసింది.రాత్రి పిల్లలతో కలిసి పడుకుని ప్రొద్దున లేవకపోవడంతో విద్యార్థినులు ప్రిన్సిపల్ కు సమాచారం ఇవ్వడంతో స్వప్నను హాస్పిటల్ కు తరలించారు.4 గంటల ముందే మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు.