దసరా, దీపావళికి ఉగ్రదాడులకు ప్లాన్..
దసరా,దీపావళికి ఉగ్రదాడులు జరుగుతాయన్న సమాచారంతో ఢిల్లీ పోలీసులను ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ పండగల వేళ ఢిల్లీలో ఉగ్రవాదులు దాడులకు దిగే అవకాశముందని హెచ్చరికలు చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా, విదేశీయులే టార్గెట్గా చేసుకుని ఈ దాడులు కొన సాగుతాయని తెలిపింది. అందుకే రద్దీగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేయాలని కూడా హెచ్చరించింది.