సంక్షోభంలో విద్యారంగం

*IMG 20241016 WA3034

*విద్యను అట్టడుగు వర్గాలకు దూరం చేస్తున్న ప్రభుత్వాలు*

బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

*కొత్తగూడెం*: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల చర్యల వల్ల అట్టడుగు కులాల,అట్టగుడు వర్గాల విద్యార్దులు విద్యకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని బహజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ విమర్శించారు.బుధవారం విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నదని ప్రజా పాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మూస ధోరణిని అవలంబిస్తున్నదని,విద్యారంగానికి 15 శాతం నిధులను కేటాయిస్తామని మ్యానిపెస్టోలో ప్రకటించి బడ్జెట్ లో కేవలం 7.3 శాతం నిధులను మాత్రమే కేటాయించిందని,అదేవిదంగా 2014 బడ్జెట్ లో విద్యారంగానికి కేంద్రంలోని మోడీ సర్కార్ 6 శాతం నిధులను కేటాయించగా..2024 నాటికి అవి 2.5 శాతానికి తగ్గించారని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఇప్పటికీ ఉన్న సుమారు 30 వేలకు పైగా పాఠశాలల్లో వసతులు కల్పించి,వాటిని అభివృద్ధి చేయకుండా నియోజకవర్గానికో ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపిస్తామని,మండలానికో సమీకృత పాఠశాలను ఏర్పాటు చేస్తామంటూ కాలయాపన చేస్తుందని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గత పది నెలల కాలంలో విద్యారంగంలో వచ్చిన,వస్తున్న మార్పులు ప్రభుత్వ విద్యను బలహీన పర్చేలా ఉన్నాయని,పేదలకు,మధ్యతరగతికే కాకుండా ఎగువ మధ్యతరగతి వారికి కూడా విద్యను దూరం చేసే విధంగా ఉన్నాయని వీటి వల్ల అభ్యాసన సంక్షోభం ఇంకా తీవ్రమయ్యే ప్రమాదం ఉందన్నారు.

Join WhatsApp

Join Now