ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు "గిఫ్ట్ ఏ స్మైల్" కార్యక్రమంలో భాగంగా పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు.
సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు అందజేశారు.
పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు ఆకాంక్షించారు. కష్టపడి చదివి తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించి సమాజానికి సేవ చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపు అనిల్ కుమార్, తాడేపు సురేష్, ఆకారం బాలచంద్రం, గున్నాల రాజు, నిమ్మ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

